maruthi: మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగా హీరో

  • 'చిత్రలహరి'తో బిజీగా సాయిధరమ్ తేజ్
  • గీతా ఆర్ట్స్ పై తదుపరి సినిమా 
  • ఏప్రిల్ తరువాత సెట్స్ పైకి

మొదటి నుంచి కూడా సాయిధరమ్ తేజ్ కథల విషయంలో నాన్చుడు ధోరణిని కనబరచలేదు. తనకి నచ్చితే చాలు .. సెట్స్ పైకి వచ్చేశాడు. ఈ దూకుడు కారణంగా ఆయన వరుస సినిమాలు చేయగలిగాడు. ఆరంభంలో ఈ దూకుడు కలిసొచ్చినా .. ఆ తరువాత వరుస పరాజయాలను అందించింది. దాంతో కథ .. కథనాల విషయంలో జాగ్రత్తపడిపోయిన సాయిధరమ్ తేజ్, కిషోర్ తిరుమలకి మాత్రమే ఓకే చెప్పాడు.

ఆయన దర్శకత్వంలో 'చిత్రలహరి' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చేస్తుండగానే  ఆయనకి 'రాచ్చసన్' .. 'గల్లీబాయ్' రీమేకుల్లో చేసే ఛాన్స్ వచ్చింది. అయినా ఆయన వాటిపై పెద్దగా ఆసక్తిని చూపలేదు. తాజాగా మారుతి వినిపించిన ఒక కథ నచ్చడంతో .. వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా గీతా ఆర్ట్స్ పై రూపొందుతుందని అంటున్నారు. ఏప్రిల్ తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నారు. 

More Telugu News