chiranjeevi: మెగా అభిమానులకు శుభవార్త .. ఆగస్టులోనే రానున్న 'సైరా'

  • స్వాతంత్ర్య సమరయోధుడి జీవితచరిత్ర
  • కీలక సన్నివేశాల చిత్రీకరణ
  • వచ్చేనెలలో షూటింగు పార్టు పూర్తి    

చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా నిర్మితమవుతోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, వేసవి సెలవుల్లో విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అందుకు ఇంకా చాలా సమయం ఉండటంతో అభిమానులు కాస్తంత నిరాశ నిస్పృహలకు లోనయ్యారు.

అయితే ఈ సినిమాను ఆగస్టులోనే విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చేసినట్టుగా తెలుస్తోంది. మార్చి మొదటివారంలో ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. దాంతో షూటింగు పార్టు పూర్తవుతుందని చెబుతున్నారు. ఆ తరువాత పోస్టు ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలుంటాయి గనుక, ఆగస్టుకు రావడం ఖాయమని అంటున్నారు. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటిస్తారని సమాచారం. 

More Telugu News