balakot: భారత వాయుసేన దాడిలో హతమైన 42 మంది సూసైడ్ బాంబర్లు... ఫోన్ నంబర్లు సహా వారి వివరాలు ఇవిగో!

  • నిన్నటి బాలాకోట్ దాడిలో 350 మంది ఉగ్రవాదుల హతం
  • సూసైడ్ బాంబర్ల వివరాలను వెల్లడించిన జీ న్యూస్
  • రావల్పిండి ఆసుపత్రిలో దాక్కున్న మసూద్ అజార్

నిన్న తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో పాక్ ప్రధాన భూభాగంలో ఉన్న జైషే మొహమ్మద్ కు చెందిన బాలాకోట్ టెర్రర్ క్యాంప్ పై భారత వాయుసేన దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 350 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయినట్టు సమాచారం. చనిపోయిన వారిలో 42 మంది శిక్షణ పొందిన సూసైడ్ బాంబర్లు ఉన్నారని జీ న్యూస్ ఓ కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు వారి పేర్లు, పుట్టిన తేదీ, అడ్రస్, ఫోన్ నంబర్లను కూడా వెల్లడించింది. ఈ 42 మందిలో 14 మంది రావల్పిండి, అటోక్ కు చెందినవారు కావడం గమనార్హం. జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ ది రావల్పిండి జిల్లానే. రావల్పిండి మిలిటరీ ఆసుపత్రిలోనే ప్రస్తుతం అతను దాక్కున్నట్టు సమాచారం.

More Telugu News