Jammu And Kashmir: జమ్మూ కశ్మీర్ ఎయిర్ స్పేస్ మూసివేత... విమానాలన్నీ రద్దు!

  • తిరిగి ప్రకటించేంత వరకూ ఆదేశాల అమలు
  • పలు విమానాల దారి మళ్లింపు
  • వెల్లడించిన రక్షణ శాఖ

జమ్మూ కశ్మీర్ లో జమ్ము, శ్రీనగర్, లేహ్ ఎయిర్ స్పేస్ ను మూసివేస్తున్నట్టు రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. తిరిగి ప్రకటించేంత వరకూ ఎయిర్ స్పేస్ తెరచుకోదని స్పష్టం చేశారు. కమర్షియల్ విమానాలన్నింటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపారు. ఈ ఉదయం పాకిస్థాన్ కు చెందిన యుద్ధ విమానాలు భారత భూభాగంవైపు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. విమాన సర్వీసులన్నింటినీ రద్దు చేస్తున్నామని, శ్రీనగర్ తదితర విమానాశ్రయాలకు చేరుకోవాల్సిన విమానాలను దారి మళ్లించామని పేర్కొన్నారు. రాజౌరీ, పూంఛ్ సెక్టార్ లోకి పాక్ యుద్ధ విమానాలు ప్రవేశించిన సంగతి తెలిసిందే.

More Telugu News