Jaggareddy: రాజకీయాల్లోకి వస్తే బ్రాహ్మణికి తిరుగులేదు... టీడీపీకి ఆస్తి జూనియర్ ఎన్టీఆరే: జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

  • ఇప్పుడప్పుడే ఆమెను రానివ్వరు
  • మరో పదేళ్ల తరువాత చంద్రబాబు రప్పిస్తారు
  • సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోడలు, బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి రాజకీయాల్లో చక్కగా రాణించగలరని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పుడప్పుడే చంద్రబాబు ఆమెను రాజకీయాల్లోకి రానివ్వబోరని, ఓ పదేళ్ల తరువాత రప్పించవచ్చని ఆయన అంచనా వేశారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృత పర్యటనలు జరిపిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన, బ్రాహ్మణికి రాజకీయాల్లో ఎదురుండదని అన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకే ఓ పెద్ద ఆస్తి అని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News