Pooja: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • పూజా హెగ్డేకు భారీ పారితోషికం 
  • గాయాల నుంచి కోలుకున్న గోపీచంద్ 
  • రవితేజ 'డిస్కోరాజా'కు మార్పులు

*  అటు మహేశ్ బాబుతోనూ, ఇటు ప్రభాస్ తోనూ కలసి నటిస్తూ బిజీగా వున్న కథానాయిక పూజా హెగ్డే భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటోందని అంటున్నారు. ప్రస్తుతం అమ్మడు ఒక్కో చిత్రానికీ 1.75 కోట్లు తీసుకుంటోందట.
*  ఇటీవల షూటింగులో గాయపడ్డ యాక్షన్ హీరో గోపీచంద్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్టు చెబుతున్నారు. దీంతో రెండు మూడు రోజుల్లో తిరు దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించే చిత్రం షూటింగులో గోపీచంద్ పాల్గొంటాడట.  
*  రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కో రాజా' పేరిట ఓ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పని జరుగుతోంది. రవితేజ సూచనల మేరకు కొన్ని సన్నివేశాలలో మార్పులు చేస్తున్నారట. ఏప్రిల్ నుంచి ఈ చిత్రం షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. 

More Telugu News