India: భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్‌ స్పందించిన సచిన్

  • తీవ్రవాద శిబిరాలను మట్టుబెట్టిన భారత్
  • తెల్లవారుజామున 3:30 గంటలకు దాడి
  • మంచితనాన్ని చేతకానితనంగా భావించొద్దన్న సచిన్

పుల్వామా దాడికి నేడు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో తీవ్రవాద శిబిరాలను మట్టుబెట్టింది. నేటి తెల్లవారుజామున 3:30 గంటలకు మొదలు పెట్టిన ఈ సర్జికల్ స్ట్రైక్‌ను కేవలం 20 నిమిషాల్లో ముగించింది. పాక్ తేరుకునే సరికి బాంబుల వర్షం కురిపించింది.

భారత వైమానిక దళాలు జరిపిన ఈ సాహసోపేత దాడిపై ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారత వాయుసేనకు సెల్యూట్ చెప్పారు. ‘మా మంచితనాన్ని చేతకానితనంగా భావించవద్దు. భారత వాయుసేనకు నా సెల్యూట్. జైహింద్’ అని సచిన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

More Telugu News