Mahesh Babu: 'మహర్షి' విడుదల వాయిదా పడటం లేదట

  • మహేశ్ తాజా చిత్రంగా 'మహర్షి'
  • ముగింపు దశకి చేరుకున్న షూటింగ్
  •  ఏప్రిల్ 25వ తేదీన విడుదల    

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా రూపొందుతోంది. మహేశ్ బాబు కథానాయకుడిగా చేస్తోన్న ఈ సినిమాలో, ఆయన సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాను ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. అయితే అనుకున్న సమయానికి పనులు పూర్తికాకపోవచ్చనీ, అందువలన ఈ సినిమా ఆ రోజున థియేటర్స్ కి రాకపోవచ్చనే టాక్ వచ్చింది. జూన్ లో ఈ సినిమా విడుదల ఉండొచ్చనే ప్రచారం ఊపందుకుంది.

అయితే ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేననీ, ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమాను ఏప్రిల్ 25వ తేదీనే విడుదల చేయనున్నారనే మాట బలంగా వినిపిస్తోంది. మార్చి 2వ వారానికి రెండు పాటలు మినహా మిగతా చిత్రీకరణ పూర్తవుతుందట. మరో వైపున మిగతా పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయట. అందువలన చెప్పిన సమయానికి ఈ సినిమా థియేటర్స్ కి రావడం ఖాయమని తెలుస్తోంది. 

More Telugu News