Surgicle Strikes: వాయుసేన పైలట్లకు నా సెల్యూట్: రాహుల్ గాంధీ

  • లక్షిత దాడులు నిర్వహించిన ఐఏఎఫ్
  • ట్విట్టర్ లో అభినందనలు చెప్పిన రాహుల్
  • దేశవ్యాప్తంగా ప్రజల హర్షం

ఈ తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి చొచ్చుకెళ్లి, ముజఫరాబాద్, బాలాకోట్ తదితర ప్రాంతాల్లో లక్షిత దాడులు నిర్వహించిన భారత వాయుసేన దళాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందించారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన "ఐఏఎఫ్ పైలట్లకు నా సెల్యూట్" అని వ్యాఖ్యానించారు. మోదీ సర్కారు నిర్వహించిన రెండో సర్జికల్ స్ట్రయిక్స్ పై దేశవ్యాప్తంగా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.

More Telugu News