chigurupati: శిఖా చౌదరిపై జయరాం భార్య ఫిర్యాదు.. కేసు నమోదు

  • జయరాం హత్య జరిగాక అతని ఇంటికెళ్లిన శిఖా చౌదరి
  • విలువైన పత్రాలను తీసుకెళ్లింది
  • జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య పద్మశ్రీ

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య జరిగాక అతని ఇంటికెళ్లి విలువైన పత్రాలను శిఖా చౌదరి తీసుకెళ్లిందని హైదరాబాద్, జూబ్లీ హిల్స్ పోలీసులకు ఆయన భార్య పద్మశ్రీ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ 448 సెక్షన్ కింద శిఖాపై కేసు నమోదు చేశారు. శిఖా స్నేహితుడు సంతోష్ పైనా పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం.

More Telugu News