Hyderabad: బంజారాహిల్స్‌లోని స్కైబ్లూ హోటల్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

  • అకస్మాత్తుగా చెలరేగిన మంటలు
  • భయంతో పరుగులు తీసిన సిబ్బంది
  • మంటలను ఆర్పేసిన ఫైర్ సిబ్బంది

హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో చెలరేగిన మంటలతో భారీ ఆస్తి నష్టం జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11లో ఉన్న స్కైబ్లూ హోటల్ మూడో  అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే హోటల్ సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీయడంతో ప్రాణ నష్టం జరగలేదు. హోటల్‌లోని ఫర్నీచర్‌కు మంటలు అంటుకోవడంతో అవి మొత్తం తగులబడి పోయాయి. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.

More Telugu News