Telangana: ద్రవ్య వినిమయ బిల్లుకు టీ-అసెంబ్లీ ఆమోదం

  • ఈరోజు ఉదయం సభలో ప్రవేశపెట్టిన బిల్లు 
  • బిల్లుపై చర్చించిన సభ
  • సవివరంగా సమాధానమిచ్చిన కేసీఆర్

ఓటాన్ అకౌంట్ ద్రవ్య వినిమయ బిల్లు-2019కు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం లభించింది. ఈ బిల్లును ఈరోజు ఉదయం సభలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. అనంతరం, ఈ బిల్లుపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో కేసీఆర్ సవివరంగా సమాధానమిచ్చారు. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. కాగా, శాసనసభ నిరవధిక వాయిదా పడింది. మూడు రోజుల పది గంటల పాటు ఈ సమావేశాలు జరిగాయి. 

More Telugu News