Telugudesam: టీడీపీ ఎమ్మెల్యేలు అక్రమంగా సంపాదించి రౌడీయిజం చేస్తున్నారు: సీపీఎం నేత మధు

  • ఏపీ ప్రభుత్వంపై మధు ఆగ్రహం
  • రాష్ట్రంలో పాలన సరిగా లేదనడానికి ఇదే నిదర్శనం
  • ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించేందుకు కొత్త పథకాలు

ఏపీ ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందో చెప్పడానికి నిదర్శనం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలేనని అన్నారు. నాలుగున్నరేళ్లలో టీడీపీ ఎమ్మెల్యేలు అక్రమంగా సంపాదించి రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించేందుకు కొత్త పథకాలు తెస్తున్నారని చంద్రబాబును విమర్శించారు.

More Telugu News