PV Sindhu: తేజస్ యుద్ధ విమానానికి కోపైలట్ గా వ్యవహరించిన పీవీ సింధు

  • విమెన్స్ డే వేడుకలను నిర్వహించిన ఏరో ఇండియా
  • తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన సింధు
  • తేజస్ తొలి మహిళా కోపైలట్ గా

భారత ఏస్ షట్లర్ పీవీ సింధు సాహసం చేసింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బెంగళూరులో ఏరో ఇండియా విమెన్స్ డే వేడుకలను ఈరోజు నిర్వహించింది. ఈ సందర్భంగా స్వదేశంలో తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ లో సింధు ప్రయాణించింది. ఈ విమానంలో ఇద్దరు పైలట్లు కూర్చునే వీలుంటుంది. వెనుక సీట్లో కూర్చొని విమానంలో సింధు ప్రయాణించింది. ఈ సందర్భంగా రక్షణశాఖ ప్రతినిధి మాట్లాడుతూ, తేజస్ యుద్ధ విమానానికి సింధు కోపైలట్ గా వ్యవహరించారని చెప్పారు. దీంతో, తేజస్ కు కోపైలట్ గా వ్యవహరించిన తొలి మహిళగా సింధు నిలిచింది.

More Telugu News