surya: సూర్య చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన పూర్ణ

  • ప్రధానమంత్రిగా మోహన్ లాల్
  • ప్రతినాయకుడిగా ఆర్య 
  • ఆగస్టులో భారీస్థాయి విడుదల     

సూర్య కథానాయకుడిగా .. 100 కోట్లకి పైగా బడ్జెట్ తో 'కాప్పన్' సినిమా నిర్మితమవుతోంది. కేవీ ఆనంద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ప్రధానమంత్రి సెక్యూరిటీ ఆఫీసర్ గా సూర్య కనిపించనున్నాడు. ప్రధానమంత్రిగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన కథానాయికగా సాయేషా సైగల్ నటిస్తుండగా, ప్రతినాయకుడి పాత్రను ఆర్య చేస్తున్నాడు.

ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం 'పూర్ణ' ను ఎంపిక చేసుకున్నారు. తెలుగులో 'సీమశాస్త్రి' .. 'అవును' తరువాత పూర్ణ చెప్పుకోదగిన సినిమాలు చేయలేకపోయింది. అప్పటి నుంచి ఆమె తమిళ సినిమాలపైనే దృష్టి పెట్టింది. ఆల్రెడీ 'కాప్పన్' షూటింగులో ఆమె పాల్గొంటోంది. ఈ సినిమా తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని ఆమె భావిస్తోంది. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు.

More Telugu News