Andhra Pradesh: 135 దేశాల్లోని 25 లక్షల ప్రవాస ఆంధ్రులకు నేను చెప్పేది ఒక్కటే!: నారా లోకేశ్

  • కువైట్ ప్రవాసాంధ్రులతో శంఖారావం సభ
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించిన లోకేశ్
  • ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని పిలుపు

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ కువైట్ లో ఉన్న ఆంధ్రులతో ‘శంఖారావం సభ’ను నిర్వహించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకోవాలన్న తపన కువైట్ లో స్థిరపడ్డ తెలుగువారిలో కనిపిస్తోందని లోకేశ్ వ్యాఖ్యానించారు.
ఈ విషయమై ట్విట్టర్ లో స్పందిస్తూ..‘కువైట్ శంఖారావం సందర్భంగా అక్కడ స్థిరపడ్డ తెలుగువారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాను. అక్కడ ఉంటున్నప్పటికీ జన్మభూమిలో జరిగే అభివృద్ధిని తెలుసుకోవాలన్న తపన వారిలో కనిపించింది. అందుకే ఏపీలో ఈ నాలుగున్నర ఏళ్ళలో జరిగిన అభివృద్ధి గురించి వారికి వివరించాను.

ప్రపంచంలోని 135 దేశాల్లో ఉన్న 25 లక్షల మంది ప్రవాసాంధ్రులకు నేను చెప్పేది ఒక్కటే. ఏ  దేశంలో ఉన్నా ప్రవాసాంధ్రులంతా ఆంధ్రప్రదేశ్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలి’ అని ట్వీట్ చేశారు.

More Telugu News