jc prabhakar reddy: ఎన్నో అవమానాలు ఉంటాయి.. నాలాంటి వాళ్లకు ఈ పదవి సరిపోదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

  • ఎమ్మెల్యే పదవి ముళ్ల కిరీటం వంటిది
  • ఎన్నో విమర్శలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది
  • ప్రతి ఒక్కరూ మంచి పనులతో ప్రజల గుండెల్లో నిలవాలి

తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవి అంటే అందరూ ఆషామాషీ అనుకుంటారని... కానీ ఆ పదవిలో ఉన్న వారికి అది ఒక గుదిబండలా ఉంటుందని ఆయన అన్నారు. ఎమ్మెల్యే పదవి ఒక ముళ్ల కిరీటం వంటిదని... తనలాంటి నైజమున్నవారికి ఆ పదవి సరిపోదని చెప్పారు. ఎమ్మెల్యే పదవిలో ఉన్నవారు ఎన్నో విమర్శలు, అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

ప్రతి మనిషి సమాజం కోసం మంచి పనులు చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం కల్పించుకోవాలని ప్రభాకర్ రెడ్డి సూచించారు. ఆ తపనతోనే తన జీవితమంతా ధారపోసి, ప్రజల కోసం పని చేస్తున్నానని చెప్పారు. 40 ఏళ్లుగా తాడిపత్రి ప్రజలు తమ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారని... వారందరి గుండెను గుడిలా చూసుకుంటున్నానని అన్నారు.

More Telugu News