Andhra Pradesh: ఎర్రన్నాయుడు పుట్టినరోజు నేడు.. ‘హ్యాపీ బర్త్ డే నాన్నా’ అంటూ ట్వీట్ చేసిన రామ్మోహన్ నాయుడు!

  • తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన టీడీపీ నేత
  • గతంలో తండ్రితో దిగిన ఫొటోను పోస్ట్ చేసిన రామ్మోహన్
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత

తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, పార్టీ సీనియర్ నేత దివంగత కింజరపు ఎర్రన్నాయుడు పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం లోక్ సభ సభ్యుడు కింజరపు రామ్మోహన్ నాయుడు తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు నాన్నా’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా చిన్నప్పుడు తనకు తండ్రి ఎర్రన్నాయుడు కేక్ తినిపిస్తున్న ఫొటోను రామ్మోహన్ నాయుడు పోస్ట్ చేశారు.
శ్రీకాకుళం జిల్లా లోక్ సభ స్థానం నుంచి ఎర్రన్నాయుడు వరుసగా నాలుగుసార్లు గెలుపొందారు. 2012, నవంబర్ 2న ఓ పెళ్లికి హాజరై శ్రీకాకుళం జిల్లాకు తిరిగివస్తుండగా, జిల్లాలోని రణస్థలం మండలం దండానపేట కూడలి వద్ద ఓ ట్యాంకర్ ను ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఎర్రన్నాయుడు మరుసటి రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News