chaitu: చైతూ జోడీగా రాశి ఖన్నా?

  • మల్టీ స్టారర్ మూవీగా 'వెంకీమామ'
  • నభా నటేశ్ కాదు రాశి ఖన్నా
  • వెంకీ జోడీ ఎవరనేది క్లారిటీ రావాలి 

బాబీ దర్శకత్వంలో 'వెంకీమామ' సినిమా రూపొందనుంది. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ హీరోల సరసన చేసే కథానాయికల విషయంలోనే రోజుకొకరి పేరు వినిపిస్తోంది. వెంకటేశ్ సరసన నాయికగా శ్రియ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆ స్థానంలో పాయల్ ను తీసుకున్నట్టుగా ప్రచారం జరిగింది.

ఇక చైతూ జోడీగా రకుల్ ను తీసుకున్నారు. అయితే ఆమె 'మన్మథుడు 2' వైపు మొగ్గు చూపడంతో, ఆమె స్థానంలో నభా నటేశ్ ను తీసుకోనున్నారనే టాక్ వినిపించింది. తాజాగా రాశి ఖన్నా పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో తన జోడీగా రాశి ఖన్నా అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని చైతూ వ్యక్తం చేయడంతో ఆమెను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి .. అలాగే వెంకీ సరసన చేసే కథానాయిక విషయంలో కూడా క్లారిటీ రావలసి వుంది.

More Telugu News