narendra modi: ఈ ప్రైజ్ నాకు వచ్చింది కాదు.. దేశ ప్రజలందరికీ వచ్చింది: మోదీ

  • దేశ ప్రజల వల్లే గత ఐదేళ్లలో భారత్ ఎంతో సాధించింది
  • ఈ పురస్కారం భారతీయులందరికీ చెందుతుంది
  • పురస్కారంతో పాటు వచ్చిన డబ్బును గంగానది ప్రక్షాళనకు వినియోగిస్తాం

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సియోల్ పీస్ ప్రైజ్ ను స్వీకరించారు. తన పురస్కారాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, 'ఈ పురస్కారం వ్యక్తిగతంగా నాకు చెందదు. భారతీయులందరికీ చెందుతుంది. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ప్రేరణ, కృషి వల్లే గత ఐదేళ్లలో భారత్ ఎంతో సాధించింది. దేశ ప్రజలందరి తరపున నేను ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్నా' అని చెప్పారు. పురస్కారంతో పాటు వచ్చిన 2 లక్షల డాలర్లను నమామి గంగా ప్రాజెక్టుకు వినియోగిస్తామని తెలిపారు. గంగానది ప్రక్షాళన కోసం ఈ పథకాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరుపుకోనున్న సంవత్సరంలో తనకు ఈ పురస్కారం రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని మోదీ చెప్పారు.

More Telugu News