mizoram: 9 పరుగులకు ఆలౌట్.. తొమ్మిది మంది డకౌట్

  • మిజోరాం, మధ్యప్రదేశ్ మహిళల జట్ల మధ్య టీ20
  • 13.5 ఓవర్లలో 9 పరుగులకు ఆలౌటైన మిజోరాం
  • తొలి ఓవర్ లోనే లక్ష్యాన్ని ఛేదించిన మధ్యప్రదేశ్

క్రికెట్ లో మనం ఎన్నో సంచలనాలను చూసి ఉంటాం. ఇలాంటి సంచలనం గురించి మాత్రం కనీసం ఊహించి కూడా ఉండం. వివరాల్లోకి వెళ్తే సీనియర్ ఉమెన్స్ టీ20 లీగుల్లో భాగంగా మిజోరాం, మధ్యప్రదేశ్ ల మధ్య పుదుచ్చేరిలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మిజోరాం మహిళల జట్టు 13.5 ఓవర్లలో కేవలం 9 పరుగులకే ఆలౌట్ అయింది. తొమ్మిది మంది బ్యాట్స్ విమెన్ డకౌట్ గా వెనుదిరిగారు. 26 బంతులను ఎదుర్కొన్న అపూర్వ మాత్రమే స్కోరు చేసింది. తాను ఎదుర్కొన్న 25వ బంతిని అపూర్వ సిక్సర్ గా మలిచింది. ఆ తర్వాతి బంతికే ఆమె కూడా ఔట్ అయింది. మరో మూడు పరుగులు ఎక్స్ ట్రాల రూపంలో రావడంతో మిజోరాం జట్టు 9 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ జట్టు తొలి ఓవర్ లోనే లక్ష్యాన్ని ఛేదించిందిం.

More Telugu News