venkatesh: 'వెంకీమామ' రెగ్యులర్ షూటింగుకి ముహూర్తం కుదిరింది

  • సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి 'వెంకీమామ'
  • ఈ నెల 24 నుంచి ఫస్టు షెడ్యూల్
  •  పూర్తి వినోదభరితంగా సాగే కథ 

బాబీ దర్శకత్వంలో 'వెంకీమామ' సినిమా నిర్మితమవుతోంది. వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా ఈ సినిమా రూపొందుతోంది. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ మల్టీస్టారర్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

ఈ నెల 24వ తేదీ నుంచి ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాకి సంబంధించిన మిగతా నటీనటులు .. సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. ఇది పూర్తి వినోదభరితంగా సాగే కథ. ఇంతకుముందు మల్టీ స్టారర్ గా వెంకటేశ్ చేసిన 'ఎఫ్ 2' హిట్ కావడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు వున్నాయి. ఈ సినిమాలో వెంకటేశ్ ఏ స్థాయి సందడి చేస్తాడో .. ఈ సినిమా చైతూకి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. 

More Telugu News