kcr: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేసీఆర్

  • ఆర్థికశాఖను తన వద్దే ఉంచుకున్న కేసీఆర్
  • గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన బెజవాడ గోపాల్ రెడ్డి, కాసు, రోశయ్య
  • తెలంగాణలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి సీఎం కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఆర్థికశాఖను తన వద్దే ఉంచుకోవడంతో... ఆర్థికమంత్రిగా ఆయన బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపిస్తున్నారు. అంతకు ముందు పుల్వామా అమరవీరులకు సభ నివాళి అర్పించింది. అనంతరం టీబ్రేక్ కోసం సభ వాయిదా పడింది. సభ పున:ప్రారంభమైన వెంటనే బడ్జెట్ ను కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాసు బ్రహ్మానంద రెడ్డి, రోశయ్యలు ముఖ్యమంత్రులుగా ఉండి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వీరి తర్వాత బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు. 

More Telugu News