Telangana: హైదరాబాద్ లో ‘మసాజ్ సెంటర్’ ముసుగులో వ్యభిచారం.. నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు!

  • హైదరాబాద్ లోని ఈస్ట్ మారేడుపల్లిలో ఘటన
  • వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం
  • నిర్వాహకులు, విటులు అరెస్ట్

తెలంగాణలోని హైదరాబాద్ లో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇక్కడి ఈస్ట్ మారేడుపల్లి ప్రాంతంలో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన తుకారంగేట్ పోలీసులు నిర్వాహకులతో పాటు ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయమై ఇన్ స్పెక్టర్ అశోక్ మాట్లాడుతూ.. ఈస్ట్ మారేడుపల్లిలో రాజేష్‌ కుమార్‌ అనే వ్యక్తి ‘ట్రాంక్విల్‌ యూనిసెక్స్‌ సెలూన్‌ అండ్‌ స్పా’ సెంటర్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే మసాజ్ సెంటర్ ముసుగులో ఇక్కడ వ్యభిచారం సాగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందిందన్నారు.

దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. నిర్వాహకులు మన్నపు శ్రావణ్‌ కుమార్, ఎల్క విద్యా సాగర్‌తో పాటు విటులు సురేశ్, రాజ్ కుమార్, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ సందర్భంగా నిందితులపై కేసు నమోదుచేసి రిమాండ్ కు తరలించారు.  

More Telugu News