Telangana: హైదరాబాద్ కు రానున్న మహేశ్ బాబు మైనపు విగ్రహం.. ఈ నెల 25 నుంచి ఏఎంబీ సినిమాస్ లో ప్రదర్శన!

  • ఏఎంబీలో లాంచ్ చేయనున్న సూపర్ స్టార్
  • ఘనంగా నిర్వహించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు
  • అనంతరం సింగపూర్ కు తరలివెళ్లనున్న మైనపు విగ్రహం

సూపర్ స్టార్ మహేశ్ బాబు మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు రూపొందించిన సంగతి తెలిసిందే. దీన్ని సింగపూర్ లోని మ్యూజియంలో భద్రపరిచారు. తాజాగా ఈ నెల 25న(సోమవారం) ఈ విగ్రహం హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ కు చేరుకోనుంది. అనంతరం ఈ మైనపు బొమ్మను మహేశ్ ఆవిష్కరించనున్నారు.

కాగా, ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఏఎంబీ సినిమాస్ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. విగ్రహావిష్కరణ అనంతరం ఈ మైనపు బొమ్మను సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలించి సందర్శకులకు అందుబాటులో ఉంచనున్నారు. కాగా, మహేశ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25న ఈ సినిమాను అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.

More Telugu News