sensex: వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 142 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 54 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3 శాతం వరకు లాభపడ్డ టాటా మోటార్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో నష్టాల్లో కొనసాగినప్పటికీ... ఆ తర్వాత లాభాల బాట పట్టాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 142 పాయింట్లు పెరిగి 35,898కి చేరుకుంది. నిఫ్టీ 54 పాయింట్లు లాభపడి 10,790 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (2.94%), వేదాంత లిమిటెడ్ (2.78%), ఓఎన్జీసీ (2.05%), బజాజ్ ఫైనాన్స్ (2.01%), సన్ ఫార్మా (1.79%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-1.33%), ఇన్ఫోసిస్ (-0.91%), మారుతి సుజుకి (-0.76%), కోల్ ఇండియా (-0.74%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.62%).     

More Telugu News