Andhra Pradesh: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. జంగా కృష్ణామూర్తికి బీ ఫారం అందజేసిన వైసీపీ!

  • బీఫారం అందించిన విజయసాయిరెడ్డి
  • ఈ నెల 25న నామినేషన్ దాఖలు
  • 28 వరకూ నామినేషన్ల దాఖలుకు గడువు

ఆంధ్రప్రదేశ్ శానసమండలి ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల కోటాలో వైసీపీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జంగా కృష్ణామూర్తిని ఎంపిక చేసింది. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈరోజు కృష్ణామూర్తికి బీఫారం అందజేశారు. కాగా, జంగా కృష్ణామూర్తి ఈ నెల 25న అమరావతిలో నామినేషన్ దాఖలు చేస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల వివరాలు..
నోటిఫికేషన్‌ జారీ: ఫిబ్రవరి 21,
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: ఫిబ్రవరి 28,
నామినేషన్ల పరిశీలన: మార్చి 1,
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: మార్చి 5,
ఎన్నికల పోలింగ్‌: మార్చి 12 (ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు),
ఓట్ల లెక్కింపు: మార్చి 12 సాయంత్రం 5 గంటలకు,

More Telugu News