nani: నిర్మాతగాను బిజీ అవుతోన్న నాని

  • నాని తాజా చిత్రంగా 'జెర్సీ'
  • తదుపరి సినిమా విక్రమ్ కుమార్ తో
  • ఇంద్రగంటి సినిమాకి సహనిర్మాతగా  

హీరోగా నాని వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. 'జెర్సీ'ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న ఆయన, తదుపరి సినిమాను విక్రమ్ కుమార్ తో చేస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా తరువాత ఆయన మోహనకృష్ణ ఇంద్రగంటితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, సహ నిర్మాతగా నాని వ్యవహరించనున్నాడు.

ఇక ఈ సినిమా తరువాత నిర్మాతగా ఆయన మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా సందీప్ రాజ్ అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయం కానున్నట్టుగా సమాచారం. 'అ' సినిమా తరహాలో ఈ సినిమా కూడా ప్రయోగాత్మకంగా ఉండనుందని అంటున్నారు. గతంలో నాని నిర్మించిన 'అ' సినిమా ఆశించినస్థాయిలో ఆదరణ పొందకపోయినా, ఆయన మళ్లీ నిర్మాతగా కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

More Telugu News