ntr: పార్లే ఆగ్రో సంస్థతో ఎన్టీఆర్ బిగ్ డీల్ .. భారీ పారితోషికం

  • ఎన్టీఆర్ ను సంప్రదించిన 'పార్లే ఆగ్రో' సంస్థ
  •  'యాప్పి ఫిజ్' ప్రచారకర్తగా ఎన్టీఆర్ 
  • నార్త్ లో కొనసాగుతోన్న సల్మాన్  

సౌత్ లో మహేశ్ బాబు .. అల్లు అర్జున్ మాదిరిగానే ఎన్టీఆర్ కూడా పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఎన్టీఆర్ బోరో ప్లస్ .. నవరత్న హెయిర్ ఆయిల్ వంటి యాడ్స్ లో బుల్లితెరపై సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనతో ప్రముఖ శీతల పానీయాల సంస్థ 'పార్లే ఆగ్రో' బిగ్ డీల్ ను కుదుర్చుకుంది.

పార్లే ఆగ్రోతో కుదిరిన డీల్ ప్రకారం, ఆ సంస్థ ఉత్పత్తుల్లో ఒకటైన 'యాప్పి ఫిజ్' పానీయం యాడ్ లో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. దక్షిణాది రాష్ట్రాల మొత్తానికి ప్రచారకర్తగా వ్యవహరించడానికిగాను ఈ సంస్థతో ఎన్టీఆర్ ఎన్నేళ్లకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు అనే విషయం బయటికి రాలేదుగానీ, ఇందుకోసం పారితోషికంగా ఆయనకి భారీ మొత్తమే ముడుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఉత్తరాదిన సల్మాన్ ఖాన్ ఈ సంస్థకి ప్రచారకర్తగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. 

ntr

More Telugu News