Andhra Pradesh: చంద్రబాబు వ్యాఖ్యలపై సర్వే చేపట్టిన రామ్ గోపాల్ వర్మ.. దర్శకుడికే జై కొట్టిన నెటిజన్లు!

  • ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ ఇప్పటికే విడుదల
  • రాజకీయంగా రేగుతున్న దుమారం
  • 84 శాతం మంది నెటిజన్లు వర్మ వెంటే

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవితంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అలాగే పలువురు టీడీపీ నేతలు వర్మపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ఓ సర్వే నిర్వహించారు.

వర్మ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘‘ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారు.. కుట్రదారుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి -చంద్రబాబు’’ ‘‘నాది కుట్రా ? నిజమా?”-ఆర్జీవీ’’ అంటూ సర్వేను నిర్వహించారు. దీంతో వర్మ చెప్పింది నిజమేనని 84 శాతం మంది చెప్పగా, కుట్ర అని 16 శాతం మంది అభిప్రాయపడ్డారు.

More Telugu News