Marriage: పెళ్లి విందు తరువాత పారిపోయిన వరుడు... విశాఖపట్నంలో కలకలం!

  • యారాడ పార్క్ మైదానంలో వివాహ ఏర్పాట్లు
  • మధ్యాహ్న విందు తరువాత కనిపించని వరుడు
  • ఫిర్యాదు చేయలేదన్న పోలీసులు

మరో నాలుగు గంటల్లో వివాహం అనగా, పెళ్లి కుమారుడు పారిపోయిన ఘటన విశాఖపట్నం కోరమండల్‌, ఎంఐజీ కాలనీలో నిన్న రాత్రి కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, ఎంఐజీ కాలనీలో నివాసం ఉండే కృష్ణ (28) అనే యువకుడికి శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన యువతితో వివాహాన్ని బుధవారం రాత్రి జరిపించేందుకు ఏర్పాట్లు జరిగాయి. శ్రీహరిపురం సమీప యారాడ పార్క్ మైదానంలో మధ్యాహ్నం విందు భోజనాలు పెట్టిన తరువాత, పెళ్లి కుమారుడు కనిపించలేదు.

అతని సెల్ ఫోన్ స్విచ్చాఫ్ అయిపోయింది. గత కొన్నాళ్లుగా మరో యువతితో అతను ప్రేమలో ఉన్నాడని, ఆమెను పెళ్లి చేసుకునేందుకే పారిపోయాడని తెలుసుకున్న ఆడ పెళ్లివారు మల్కాపురం పోలీసులను ఆశ్రయించారు. పెళ్లి కొడుకు పారిపోయాడన్న విషయాన్ని తమ దృష్టికి తెచ్చారని, అయితే, ఎవరూ ఈ విషయంలో ఫిర్యాదు చేయలేదని చెప్పిన పోలీసులు, ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతామని తెలిపారు.

More Telugu News