Tremors: ఢిల్లీలో స్వల్ప భూకంపం.. బయటకు పరుగులు తీసిన జనం

  • తెల్లవారుజామున భూ ప్రకంపనలు
  • రిక్టర్ స్కేలుపై 3.9గా తీవ్రత నమోదు
  • భూమికి ఐదు కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రం

ఢిల్లీలో ఈ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో సంభవించిన ఈ ప్రకంపన తీవ్రత 3.9 గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్‌ కేంద్రంగా  భూమికి 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు.

More Telugu News