Rashikhanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • బెల్లంకొండ శ్రీనివాస్ కు జతగా రాశిఖన్నా 
  • 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ కి కొత్త టైటిల్ 
  • 'మన్మథుడు 2'కి సంగీత దర్శకుడి ఎంపిక

*  బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రాశిఖన్నా కథానాయికగా నటించనుంది. తమిళంలో హిట్టయిన 'రాచ్చసన్' చిత్రాన్ని బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో కథానాయికగా రాశిఖన్నాను ఎంపిక చేశారు.
*  తెలుగులో హిట్టయిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని విక్రం తనయుడు ధృవ్ హీరోగా తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. గతంలో షూటింగ్ చేసిన అవుట్ పుట్ సంతృప్తికరంగా రాకపోవడంతో, మళ్లీ ఫ్రెష్ గా షూటింగ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్తగా ఈ చిత్రానికి దర్శకుడిగా గిరీసాయను ఎంచుకోగా, దీనికి 'ఆదిత్య వర్మ' అనే టైటిల్ని నిర్ణయించారు.  
*  నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' చిత్రాన్ని రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా 'ఆర్ఎక్స్ 100' ఫేం చైతన్ భరద్వాజ్ ను ఎంపిక చేసినట్టు సమాచారం.

More Telugu News