rana: 'గృహం' దర్శకుడితో రానా సినిమా

  • మరో కొత్త కథతో రానా
  • దర్శకుడిగా మిలింద్ రావ్ 
  • ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్

కొత్తదనం వున్న కథలకి మాత్రమే రానా ప్రాధాన్యతనిస్తున్నాడు .. కొత్తదనం కలిగిన కాన్సెప్టులకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అలా ఆయన అంగీకరించిన తమిళ .. హిందీ సినిమాలు సెట్స్ పై వున్నాయి. ఆ సినిమాల షూటింగులతో ఆయన బిజీగా వున్నాడు. త్వరలోనే ఆయన ఒక తెలుగు సినిమా చేయనున్నాడు.

గతంలో 'గృహం' సినిమాను రూపొందించిన మిలింద్ రావ్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. గోపీనాథ్ ఆచంట ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఆగస్టులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందనున్న ఈ సినిమా, రానాకి హిట్ ఇస్తుందేమో చూడాలి. 

More Telugu News