Prakasam District: ప్రకాశం జిల్లాలో వైసీపీ, టీడీపీ వర్గీయుల ఘర్షణ.. పలువురు కార్యకర్తలకు గాయాలు!

  • కొణిజేటి చేనేతపురిలో ప్రజా సమస్యలపై సమావేశం
  • ఆమంచి, పాలేటి వర్గీయుల ఘర్షణ
  • గాయపడ్డవారిని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

ప్రకాశం జిల్లాలో వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్, టీడీపీ నాయకుడు పాలేటి రామారావు వర్గీయులు ఘర్షణకు దిగారు. కొణిజేటి చేనేతపురిలో ప్రజా సమస్యలపై పాలేటి రామారావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పాలేటి వర్గీయులతో పాటు ఆమంచి వర్గీయులు కూడా హాజరయ్యారు. ఈ సభకు ఎందుకొచ్చారంటూ వైసీపీ కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు ప్రశ్నించడంతో వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలకు గాయాలైనట్టు సమాచారం. గాయపడ్డ వారిని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

More Telugu News