Andhra Pradesh: గుంటూరు జిల్లా టీడీపీలో కుమ్ములాట.. రోడ్డుపైనే కొట్టుకున్న రెండు గ్రూపులు!

  • తాడికొండ నియోజకవర్గం వెంకటపాలెంలో ఘటన
  • ఇరువర్గాలను సముదాయించిన పోలీసులు
  • శ్రావణ్ కుమార్ కు మళ్లీ టికెట్ ఇవ్వొద్దన్న టీడీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలో జెడ్పీ మాజీ చైర్మన్ పూర్ణచంద్రరావు చంద్రబాబు మళ్లీ సీఎం కావాలంటూ పాదయాత్ర చేపట్టారు. అయితే ఈ యాత్ర వెంకటపాలెంకు చేరుకోగానే ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వర్గీయులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాటామాటా పెరగడంతో ఇరువర్గాలు రోడ్డుపైనే ఘర్షణకు దిగాయి.

వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. కాగా, ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. శ్రావణ్ కుమార్ కు ఈసారి పార్టీ టికెట్ ఇవ్వరాదని తెలిపారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాగా, ఈ ఘర్షణ విషయమై టీడీపీ అధినాయకత్వం ఇంతవరకూ స్పందించలేదు.

More Telugu News