Congress: ఈ నెల 22న తిరుపతిలో రాహుల్ గాంధీ బహిరంగ సభ: రఘువీరారెడ్డి

  • రేపటి నుంచి మార్చి 3 వరకు ‘భరోసా యాత్ర’
  • ‘హోదా’ ఇస్తామని మోదీ చెప్పిన తిరుపతిలోనే మా సభ
  • రేపు నిర్వహించే ర్యాలీలో రాహుల్ పాల్గొంటారు

ఈ నెల 22న తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బహిరంగ సభ జరగనుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. రేపటి నుంచి మార్చి 3 వరకు ‘ప్రత్యేక హోదా భరోసా యాత్ర’ నిర్వహిస్తామని రఘువీరారెడ్డి పేర్కొన్నారు. రేపు తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ర్యాలీలో రాహుల్ పాల్గొంటారని చెప్పారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని నాడు మోదీ చెప్పిన తిరుపతిలోనే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశామని అన్నారు. 

More Telugu News