Rajamouli: ‘ఆర్ఆర్ఆర్’.. ‘బాహుబలి’కి ఏమాత్రం తీసిపోదు: రాజమౌళి

  • రూ.300 కోట్లతో నిర్మిస్తున్న దానయ్య
  • ఇదొక పాన్ ఇండియా చిత్రమన్న రాజమౌళి
  • భారీగా పెరిగిన అంచనాలు

దర్శకధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రూ.300 కోట్లతో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా రాజమౌళి.. ఈ చిత్రం ‘బాహుబలి’కి ఏమాత్రం తీసిపోదని.. ఇదొక పాన్ ఇండియా (దేశంలోని అన్ని ప్రాంతాలకూ సరిపోయేది) చిత్రమని వెల్లడించారు.

రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. రామ్ చరణ్‌పై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇదొక పిరియాడికల్ మూవీ అని ఇప్పటికే టాక్ నడుస్తోంది. ఇటీవల లీక్ అయిన కొన్ని షూటింగ్ తాలూకు ఫోటోలు కూడా ఈ విషయాన్ని ధ్రువపరుస్తున్నాయి.

More Telugu News