jayaram: జయరాంకు రాకేశ్ రెడ్డి డబ్బులిచ్చినట్టుగా ఆధారాలు లేవు: వెస్ట్ జోన్ డీసీపీ

  • సెటిల్ మెంట్లతో సంపాదించానని రాకేశ్ అంటున్నాడు
  • రాజకీయ నాయకులతో సంబంధాలున్నట్టు చెప్పాడు
  • రాజకీయ నేతల ప్రమేయం పై ఆరా తీస్తున్నాం

ప్రముఖ వ్యాపారవేత్త జయరాంకు రాకేశ్ రెడ్డి డబ్బులిచ్చినట్టుగా చెబుతున్నాడు కానీ, అందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం లేవని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. భూముల సెటిల్ మెంట్లు చేసి డబ్బు సంపాదించానని రాకేశ్ చెబుతున్నాడని, కొందరు రాజకీయ నాయకులతోనూ తనకు సంబంధాలున్నట్టు చెప్పాడని, ఈ హత్య కేసులో రాజకీయ నేతల ప్రమేయం పైనా ఆరా తీస్తున్నామని వివరించారు.

More Telugu News