modi: మోదీ, కేసీఆర్ తో పాటు ట్రంప్ ను కూడా కలిపితే బాగుంటుందేమో!: టీడీపీపై అవంతి శ్రీనివాస్ సెటైర్లు

  • టీడీపీ నాయకులు వైసీపీలో చేరడం వెనుక మోదీ, కేసీఆర్ పాత్రా!
  • మోదీకీ, కేసీఆర్ లకు ఇంక పనేమీ లేదా?
  • మీడియా ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చు  

టీడీపీ నాయకులు వైసీపీలో చేరడం వెనుక ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ల ప్రమేయం ఉందంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలపై అవంతి శ్రీనివాస్ స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘మోదీకీ, కేసీఆర్ కు ఇంక పనేమీ లేదా? ఇదే పనా ఏంటీ? ట్రంప్ ను కూడా కలిపితే బాగుంటుందేమో. ఆకాశానికి, భూమికి లింక్ పెడతారు వాళ్లు (టీడీపీ నాయకులు). సరే, మీడియా చేతిలో ఉంది కాబట్టి నోటికొచ్చినట్టు ఏదైనా మాట్లాడొచ్చు’ అని విమర్శించారు.

More Telugu News