Major Chitresh Singh: పెళ్లికి 19 రోజుల ముందు... ఇంటికి విగతజీవిగా వచ్చిన మేజర్... వేలమంది కన్నీరు!

  • నిన్న బాంబ్ ను డిఫ్యూజ్ చేస్తుంటే ప్రమాదం
  • ఐఈడీ బాంబ్ పేలి మేజర్ చిత్రేష్ సింగ్ మృతి
  • మార్చి 7న వివాహం, అంతలోనే విషాదం 

తన బిడ్డ వివాహాన్ని వైభవంగా జరిపించాలని కలలుకన్న ఆ తల్లిదండ్రుల కలలు కల్లలయ్యాయి. మరో 19 రోజుల్లో వివాహం ఉందనగా, కుమారుడి మృతదేహాన్ని చూసిన ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోగా, వేలాది మంది అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ఆదివారం నాడు జమ్మూ కశ్మీర్ లో ఓ ఐఈడీ బాంబ్ ను డిఫ్యూజ్ చేస్తూ, అమరుడైన మేజర్ చిత్రేష్ సింగ్ భౌతికకాయం, ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ కు ఈ ఉదయం చేరుకుంది.

31 సంవత్సరాల చిత్రేష్ కు మార్చి 7వ తేదీన పెద్దలు వివాహాన్ని నిశ్చయించారు. ఈ పెళ్లి నిమిత్తం ఆయనకు సెలవు కూడా మంజూరైంది. మరో రెండు వారాల్లో ఆయన ఇల్లు చేరుకోవాల్సి వుండగా, ఇలా విగతజీవిగా వచ్చి, ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేశాడు. చిత్రేష్ సింగ్ భౌతిక కాయం వద్ద ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద సింగ్ రావత్ నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.




More Telugu News