Soldiers: పుల్వామా ఘటన మరువకముందే కశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్.. నలుగురు భద్రతా సిబ్బంది వీర మరణం

  • పుల్వామాలోనే మొన్నటి ఘటనకు సమీపంలోనే ఎన్‌కౌంటర్
  • అమరుల్లో ఆర్మీ మేజర్
  • నక్కి ఉగ్రవాదుల కోసం వేట

పుల్వామా ఉగ్రదాడిని మర్చిపోకముందే జమ్ముకశ్మీర్‌లో మరో ఘటన జరిగింది. పుల్వామా జిల్లాలోని పింగ్లం ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో నలుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు. వీరిలో ఓ ఆర్మీ మేజర్ కూడా ఉన్నారు. నాలుగు రోజుల క్రితం ఆత్మాహుతి దాడి జరిగిన ప్రదేశానికి అతి దగ్గర్లోనే ఈ ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం.

అమరులైన భద్రతా సిబ్బంది 55 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన వారు. కాగా, ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు ఇంకా ఆ ప్రాంతంలో నక్కి ఉన్నట్టు అనుమానిస్తున్నారు. వారి కోసం భద్రతా దళాలు వేట ప్రారంభించాయి. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ పౌరుడు కూడా మృతి చెందినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 14న జైషే మహమ్మద్ ఉగ్రవాది అదిల్ అహ్మద్ దర్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.

More Telugu News