akhil: 'గీత గోవిందం' దర్శకుడితో అఖిల్ తదుపరి సినిమా?

  • అఖిల్ 4వ సినిమాకి సన్నాహాలు
  • నాగార్జున దృష్టిలో పరశురామ్
  • గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాణం    

అఖిల్ తొలి మూడు సినిమాలు ఆశించిన ఫలితాలను అందించలేదు. దాంతో అభిమానులంతా ఆయన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. అఖిల్ కూడా ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. అందువల్లనే కథల ఎంపికలో మరింత జాగ్రత్త వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఫలానా దర్శకుడితో ఆయన తదుపరి సినిమా వుండనుందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టమైంది.

తాజాగా ఇప్పుడు 'గీత గోవిందం' దర్శకుడు పరశురామ్ పేరు తెరపైకి వచ్చింది. 'గీత గోవిందం' చూసిన తరువాత, ఆ కథను పరశురామ్ హ్యాండిల్ చేసిన తీరు నాగార్జునకి బాగా నచ్చిందట. దాంతో ఆయనతో అఖిల్ సినిమా వుంటే బాగుంటుందని భావించినట్టు సమాచారం. ఈ కారణంగానే అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నట్టుగా చెబుతున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే ఈ సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు విషయంలో క్లారిటీ రానుంది. 

More Telugu News