Vizag: అప్పు తీర్చలేదని యువతిని వేడినూనెలోకి నెట్టేసిన ఫైనాన్షియర్!

  • పెంటారావు వద్ద రూ. 20 వేలు తీసుకున్న రత్నం
  • బజ్జీలు వేయించే బాండిలోకి నెట్టేసిన ఫైనాన్షియర్ 
  • అరెస్ట్ చేసిన పోలీసులు

తన వద్ద తీసుకున్న బకాయిని సకాలంలో చెల్లించడంలో విఫలమైందన్న కారణంతో ఓ యువతిని ఫైనాన్షియర్ సలసలా మరుగుతున్న నూనెలోకి నెట్టేసిన ఘటన విశాఖపట్నం జిల్లా పాడేరులో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, పాడేరు పట్టణంలో బజ్జీల దుకాణం నడిపే రత్నం అనే మహిళ, పెంటారావు అనే ఫైనాన్షియర్ వద్ద రూ. 20 వేలను అప్పుగా తీసుకుంది.

తిరిగి ఇప్పటికే రూ. 10 వేలకు పైగా చెల్లించింది. మొత్తం బకాయి తనకు వెంటనే కట్టాలంటూ గత కొంతకాలంగా పెంటారావు ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడు. ఆమె ఇంటికి తాళం వేసి వేధించాడు. ఈ క్రమంలో బజ్జీల దుకాణానికి వచ్చిన పెంటారావు, ఆమెతో గొడవపడి, బజ్జీల కోసం సిద్ధం చేస్తున్న నూనె బాండీలోకి ఆమెను నెట్టాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, బాధితురాలు, ప్రత్యక్ష సాక్షుల ఫిర్యాదుతో పోలీసులు పెంటారావును అరెస్ట్ చేశారు.

More Telugu News