Jammu And Kashmir: అమితాబ్ పెద్ద మనసు.. వీర జవాన్ల కుటుంబాలకు భారీ విరాళం!

  • ఒక్కో జవాన్ కుటుంబానికి రూ.5 లక్షలు
  • అమర జవాన్ల కుటుంబాలను కలవనున్న అమితాబ్  
  • అమితాబ్ ప్రతినిధి మీడియాకు వెల్లడి

పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ భారీ విరాళం ప్రకటించారు. అమరులైన ఒక్కో జవాన్ కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున సాయం చేయనున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ ప్రతినిధి మీడియాకు అమితాబ్ ప్రతినిధి తెలిపారు. దేశం కోసం అసువులు బాసిన అమర జవాన్ల కుటుంబాలను అమితాబ్ నేరుగా కలవబోతున్నట్టు వెల్లడించారు. కాగా, ‘భారత్ కే వీర్ నిధి’కి బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఇప్పటికే విరాళాలు అందజేశారు. 

More Telugu News