crpf: జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన చంద్రబాబు

  • ఒక్కో అమర జవాను కుటుంబానికి రూ. 5 లక్షలు
  • అమరుల త్యాగాలను జాతి గుర్తుంచుకుంటుందన్న చంద్రబాబు
  • కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అండగా ఉంటామన్న సీఎం

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. ఒక్కో అమర జవాను కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నట్టు తెలిపారు. అమరుల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని చెప్పారు. జవాన్ల కుటుంబాలకు అందరూ అండగా నిలవాలని కోరారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటివి చోటు చేసుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా వ్యూహాన్ని అనుసరించాలని అన్నారు. ఉగ్రదాడిలో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పారు.

More Telugu News