Andhra Pradesh: వైసీపీలో చేరిన నంద్యాల ‘ఇరిగెల బ్రదర్స్’.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్!

  • ఇద్దరిని లోటస్ పాండ్ కు తీసుకొచ్చిన శిల్పా మోహన్ రెడ్డి
  • వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిన నంద్యాల నేతలు
  • సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ అధినేత

టీడీపీ మాజీ నేతలు ఇరిగెల రాంపుల్లా రెడ్డి, ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి ఈరోజు వైసీపీలో చేరారు. నంద్యాల నేత శిల్పా మోహన్ రెడ్డితో కలిసి ఈరోజు హైదరాబాద్ లోని జగన్ నివాసానికి వీరిద్దరూ చేరుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీలో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన జగన్.. పార్టీ కండువా కప్పి వీరిద్దరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కాగా, ఇరిగెల రాంపుల్లా రెడ్డి, ఇరిగెల సూర్య నారాయణ రెడ్డికి వైసీపీలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారన్న విషయమై ఆ పార్టీ నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. మంత్రి భూమా అఖిలప్రియ అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ ఇరిగెల రాంపుల్లా రెడ్డి గతేడాది డిసెంబర్ 28న టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News