sai dharam tej: నన్ను విమర్శించినవారికి సమాధానమే 'చిత్రలహరి': హీరో సాయిధరమ్ తేజ్

  • కిషోర్ తిరుమల నుంచి 'చిత్రలహరి'
  • ఎమోషనల్ ఎంటర్టైనర్ గా సాగే కథ
  •  ఏప్రిల్ 12వ తేదీన విడుదల    

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ .. కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తేజు సరసన కథానాయికలుగా కల్యాణి ప్రియదర్శన్ .. నివేద పేతురాజ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది.

తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ .. " తండ్రీకొడుకుల చుట్టూ తిరిగే కథగా .. ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుంది. బలమైన కథాకథనాలతో .. అనూహ్యమైన మలుపులతో ఆద్యంతం ఆసక్తిరంగా కొనసాగుతుంది. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఈ కంటెంట్ బాగా కనెక్ట్ అవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వరుస పరాజయాల కారణంగా నన్ను విమర్శించిన వాళ్లందరికీ ఈ సినిమా సమాధానం చెబుతుంది" అని అన్నాడు. ఏప్రిల్ 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News