Telangana: మరుగుజ్జులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త

  • హైదరాబాద్, వరంగల్‌ నగరాల్లో పూర్తి ఉచితం
  • ఇతర ప్రాంతాల్లో 50 శాతం రాయితీ
  • పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకు వర్తింపు

మరుగుజ్జులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మరుగుజ్జులకు రాయితీలు ప్రకటించింది. హైదరాబాద్, వరంగల్‌లోని ఆర్డినరీ సిటీ బస్సుల్లో వారు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. అలాగే, ఇతర ప్రాంతాల్లో 50 శాతంతో రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది. అయితే, ఇది పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు తెలిపారు.

More Telugu News