America: అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం.. ఆరుగురి మృతి

  • విచక్షణ రహితంగా ఉన్మాది కాల్పులు
  • ఆరుగురు దుర్మరణం.. ఐదుగురికి గాయాలు
  • పశ్చిమ షికాగోలో ఘటన

అమెరికాలోని పశ్చిమ షికాగోలో తుపాకి మరోమారు గర్జించింది.  ఇల్లినాయిస్‌లోని ఇండస్ట్రియల్‌ పార్కు వద్ద ఓ వ్యక్తి తుపాకితో విరుచుకుపడ్డాడు. దుండగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా సిబ్బంది సహా ఐదుగురు గాయపడ్డారు. పైపులకు సంబంధించిన వాల్వుల తయారీ పరిశ్రమ హెన్రీ ప్రాట్ కంపెనీలో పనిచేసే గ్యారీ మార్టిన్ (45) ఈ దారుణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మార్టిన్‌ను కాల్చి చంపారు. మార్టిన్ దారుణానికి పాల్పడడం వెనక ఉన్న కారణం తెలియరాలేదు.

More Telugu News